యూపీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉమేశ్ పాల్ హత్యకేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ఎన్ కౌంటర్లో చనిపోయాడు. కౌంథియారా పోలీస్ స్టేషన్ ఫరిధిలో ప్రయాగరాజ్ పోలీసులు, నిందితుడికి మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో ఉస్మాన్ హతమైనట్టు ప్రయాగరాజ్ పీసీ రమిత్ శర్మ తెలిపారు. అంతకుముందే అంటే…. ఉమేశ్ పాల్ ను చంపిన మూడురోజుల తరువాత మరో నిందితుడు అర్బాజ్ ను పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఉమేశ్ పాల్ హత్య సమయంలో ఆయన కారు నడిపింది అర్బాజే. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అతిఖ్ అహ్మద్ కు అర్బాజ్ అత్యంత సన్నిహితుడుగా చెప్తారు. అర్బాజ్ ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడు.అయితే ఉమేశ్ పాల్ హత్యతో తన భర్తకు కానీ, తమ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ అతిఖ్ భార్య పర్వీన్ సీఎం యోగీకి లేఖరాశారు. పర్వీన్ ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరారు.
https://twitter.com/ani_digital/status/1632576529246076928?s=20