మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ఓ మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులకు, ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ విషయం కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. ఇరువర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం ప్రారంభించారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఘర్షణలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. పరిస్థితిని నియంత్రించడానికి, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ లను ప్రయోగించారు.
“కొందరు హనుమంతుని విగ్రహాన్ని దర్గా సమీపంలో ఉంచారు, ఇది కచారి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు రాళ్లు విసిరి 3-4 మోటార్సైకిళ్లను ధ్వంసం చేశారు, అయితే ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసు బలగాలను అక్కడికి చేరుకొని అదుపు చేశారు” అని నీముచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సూరజ్ కుమార్ తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్ సహా ఇతర మార్గాల ద్వారా దుండగులను గుర్తించి పోలీసులు చర్యలు తీసుకుంటారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ఈ కేసులో మొత్తం 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఎస్పీ ధృవీకరించారు