
file photo
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. కుల్గామ్ ఎన్కౌంటర్లో ఎదురుకాల్పుల్లో 34 ఆర్ఆర్కి చెందిన ఆర్మీ జవాను జై కుమార్ గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ లోని యారిపోరాలోని బ్రాయిహార్డ్ కత్పోరా ప్రాంతంలో యాంటీ-మిలిటెన్సీ ఆపరేషన్లో భాగంగా కాల్పులు జరిపారు. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాగి ఉన్న ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసిరారని.. చుట్టుపక్కల వలయాన్ని బిగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.