ఫాక్ట్ చెకర్ గా చెప్పుకునే ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ఓ ఫేక్ వీడియో షేర్ చేసి మరోసారి అభాసుపాలయ్యాడు. ఓ న్యూస్ చానల్లో క్రికెట్ గురించి అన్నామలై మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి ట్వీట్ చేశాడు. ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ అభిషేక్ ముందు ఆ ఎడిటెడ్ వీడియోను జతచేసి ట్వీట్ చేయగా దాన్ని జుబైర్ షేర్ చేశాడు.
https://twitter.com/zoo_bear/status/1663572316545236992?s=20
అందులో అన్నామలై మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త అయిన జడేజా సీఎంకే గెలుపునకు సాయం చేశాడని ఉంది. అసలైతే అన్నామలై అన్నది వేరు. కానీ 9 సెకన్ల వీడియోను మాత్రమే షేర్ చేసి తమకు కావల్సింది తీసుకుని ప్రచారం చేసింది జుబైర్ అండ్ టీం. 9 సెకన్ల ఆ వీడియోలో “CSKని గెలిపించింది ఎవరు BJP కార్యకర్త. జడేజా బిజెపి కార్యకర్త, అతని భార్య బిజెపి ఎమ్మెల్యే , అతను గుజరాతీ’ అని అన్నామలై అన్నమాటలున్నాయి.
జడేజా బీజేపీ కార్యకర్త కనుక , అతని భార్య ఎమ్మెల్య కనుక గుజరాత్ కు చెందిన జడేజా సీఎస్కే విజయానికి కారణమయ్యాడని జుబేరా టీం ప్రచారంచేసే ప్రయత్నం చేసింది. ఆ వీడియో చూసిన, అన్నామలై మాటలు విన్న ఎవరికైనా అదే నిజమనీ అనిపిస్తుంది. దీన్ని తమిళనాడులో అధికార డీఎంకే సైతం సోషల్మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. అన్నామలైని టార్గెట్ చేస్తూ ఎగతాళి చేస్తున్నారక్కడ. కానీ అసలు విషయం వేరు. ఫ్యాక్ట్ చెక్ చేయగా అన్నామలై సీఎస్కే టీం విజయానికి క్రెడిట్ క్లెయిమ్ చేయలేదని స్పష్టం అవుతోంది. న్యూస్18లో యాంకర్ దేవప్రియన్ …ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం గురించి అన్నామలైతో ప్రస్తావిస్తూ దానిపై విమర్శల గురించి అడిగారు. అయితే సీఎస్కే విజయం గుజరాత్ మోడల్ పై ద్రావిడ్ విజయం అని ఇంకేదో అంటూ అధికార డీఎంకే దాన్ని రాజకీయం చేయబోయింది. ఆ వ్యాఖ్యలనే అన్నామలై గుర్తు చేస్తూ.. జడేజా బీజేపీ కార్యకర్త, బీజేపీ ఎమ్మెల్యే భార్య అని అంటున్నారని…అయితే సీఎస్కే విజయం కోసం శ్రమించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త, ఆయన భార్య గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, CSK కంటే గుజరాత్ టైటాన్స్లో ఎక్కువ మంది తమిళులు ఉన్నారు. కానీ ధోనీకి సీఎస్కే గర్వకారణం. కాబట్టి జడేజాలాగే మీ డిఎంకె మంత్రులకు చెప్పండి, బిజెపి కార్యకర్తలు 2024 తమిళనాడును కూడా గెలుస్తారని అని అన్నామలై అన్నారు.
https://twitter.com/cogitoiam/status/1663575504975286277?s=20
డీఎంకే వాదనల్ని మాత్రమే అన్నామలై కోట్ చేశారు. అయితే ఫేక్ వార్తల్ని ప్రచారం చేయడంలో ముందుండే.. బీజేపీ వ్యతిరేక ప్రచారంలో ఆరితేరిన జుబైర్ టీం మాత్రం పూర్తిగా తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ వైరల్ చేస్తోంది. అయితే నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ మొత్తం వీడియోను షేర్ చేస్తూ గట్టి కౌంటరే ఇస్తున్నారు. అంతేకాదు నెటిజన్లు నిలదీస్తున్నా ఆ ట్వీట్ ను తొలగించలేదు జుబైర్ అతని టీం. ఇంకా వారినే పరిహాసం చేస్తూ వస్తున్నారు.
తమిళనాడులో అన్నామలై రాకతో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడుతోంది. దీంతో బీజేపీ వ్యతిరేక మీడియా, శక్తులు ఇప్పుడు అన్నామలైని లక్ష్యంగా చేసుకున్నారు. అందులో భాగమే పూర్తిగా ఎడిట్ చేసినా వీడియో క్లిప్పింగ్ ను వైరల్ చేయడం.ఆటల్లో , జట్టుల్లో కూడా బీజేపీ వ్యక్తులున్నారా లేరా అని వాళ్లు చూస్తారని కానీ తమిళులం ధోని గెలిపించిన జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని చురకేశారు.
కేవలం ఆల్ట్ న్యూస్ మాత్రమే కాదు న్యూస్ పోర్టల్ దిన్యూస్ మినిట్ కూడా ఈ వీడియోను వైరల్ చేస్తూ.. జడేజాపై అన్నామలై వీరాభిమానం అనే శీర్షికతో ఆర్టికల్ పోస్ట్ చేసింది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ది లాలాన్టాప్ ఆల్ట్ న్యూస్ హెడ్డింగే పెట్టి అన్నామలై ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకోకుండానే ఎడిట్ చేసిన వీడియోను ప్రస్తావిస్తూ వార్తలు రాశాయి.
https://twitter.com/erbmjha/status/1663590036921630723?s=20