బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మన దేశంలో ప్రసారం కాకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ…ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా..వచ్చే సోమవారం విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ తెలిపారు. తమ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటిని పరిశీలించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పార్థీవాలాల ధర్మాసనం వచ్చేవారం విచారిస్తామని తెలిపింది.