భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం యాదాద్రి వెళ్లారు. సీజేఐకి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు… చీఫ్ జస్టిస్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం బాలాలయంలో ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణపనుల్ని పరిశీలించారు.