ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు చేస్తోంది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ప్రశ్నించారు. నెలరోజుల క్రితం కూడా మార్గదర్శి కార్యాలయాలపై సీఐడీ, జీఎస్టీ, ఎన్ఫోర్స్ మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులు జరిగాయి. వీటిపై అప్పుల్లో ఏపీ హైకోర్టును మార్గదర్శి ఆశ్రయించింది.