క్రైస్తవ మిషనరీల అరాచకాల కు సంబంధించి కళ్లు చెదిరే విషయం బయటపడింది. తెలుగు నేల మీద విచ్చలవిడిగా మతమార్పిడి చేస్తున్న పాస్టర్ల మాఫియా … ఇప్పుడు విదేశాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇదే దందా సాగిస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. ఈ సబ్జెక్టు మీద ఆరా తీస్తే కళ్ళు చెదిరే విషయాలు బయటపడ్డాయి.
…..
ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం..
గల్ఫ్ దేశాలలో ముఖ్యమైన ఖతర్ లో క్రైస్తవ మత దందా బయటపడింది. దోహా నగరం లోని తుమామా ప్రాంతంలో,, అనుమతులు తీసుకోకుండా ఇళ్ళ మధ్య చర్చిలు తయారు చేసి, మత మార్పిడిలకు పాల్పడుతున్న 11 మంది భారతీయ పాస్టర్ లను అరెస్టు చేశారు. ఇందులో ఐదు మంది తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో మతమార్పిడి తీవ్రమైన నేరం. అటువంటి ప్రయత్నాలు చేస్తే కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. కానీ, లిబరల్ దేశంగా పేరు ఉన్న ఖతర్ వంటి కొన్ని దేశాలలో క్రైస్తవ మతాన్ని నిర్వహించుకోవచ్చు. కానీ అక్రమంగా మతమార్పిడులకు దిగితే మాత్రం ఒప్పుకోరు. నిర్దిష్ట ప్రదేశాలలో అనుమతి తీసుకున్నాక మాత్రమే చర్చి నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా భారతీయులు,, ముఖ్యంగా తెలుగువారు అక్కడికి వెళ్లి ఇళ్ళ మధ్యనే చర్చిలు పెట్టేస్తున్నారు. మాయమాటలు చెప్పి క్రైస్తవంలోకి మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదంతా ఒక మాఫియా మాదిరిగా జరిగిపోతోంది.
………..
ఈ పాస్టర్ల వ్యవస్థ ఒక మాఫియాలా విస్తరించింది.
(( Use vizag port shots))
కొన్ని కోస్తా జిల్లాల నుంచి ఎంపిక చేసిన పాస్టర్లను గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. మతమార్పిడిలలో ఇక్కడ సక్సెస్ సాధించిన పాస్టర్లకు భారీగా వేతనాలు ఇచ్చి అక్కడకు పంపిస్తున్నారు. గుంపులు, గుంపులుగా విమానాల్లో పంపిస్తే గోల అవుతుందన్న ఉద్దేశంతో… విశాఖపట్నం నుంచి ఓడల ద్వారా గల్ఫ్ దేశాలకు ఈ పాస్టర్లను తరలిస్తున్నట్లు సమాచారం. గల్ఫ్ దేశాలలో కార్మికులుగా పనిచేస్తున్న తెలుగు వారి జనావాసాల మధ్య ఈ పాస్టర్లను దింపుతున్నారు. అక్కడ అక్రమంగా చర్చిలు పెట్టి వారిని క్రైస్తవం వైపు మళ్ళించడమే ఈ పాస్టర్ల డ్యూటీ. గల్ఫ్ దేశాలలో ఒంటరిగా ఉంటున్న వారి మీద పంజా విసరడమే ధ్యేయం. మాయ మాటలతో మతమార్పిడి చేశాక ,, వాళ్ళ సంపాదన అంతా చర్చిలకు మళ్లిస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక మంది తెలుగు పాస్టర్లు వివిధ గల్ఫ్ దేశాలలో మతమార్పిడులు చేస్తున్నట్లు సమాచారం.
…………
కేవలం పదిమంది పాస్టర్లు మాత్రమే దొరికారు కానీ వందల సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న పాస్టర్లు దొరకలేదు. ఇక్కడ ఆంధ్రాలో వేల సంఖ్యలో దర్జాగా మతమార్పిడి చేస్తున్న పాస్టర్లను ఏమీ అనడం లేదు. పైగా ఏపీ ప్రభుత్వమే నెల జీతాలు ఇచ్చి మరి పాస్టర్లను ప్రోత్సహిస్తోంది. ఇది మరింత విశేషం.