11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన క్రైస్తవ మతగురువును ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ పట్టణంలోని చాందినగర్లో ఈ దుర్మార్గం వెలుగుచూసింది. తమిళనాడు కన్యాకుమారికి చెందిన 67 ఏళ్ల చర్చి పాస్టర్ ఆల్బర్ట్ అక్కడే ఓ చర్చిలో మతబోధకుడిగా ఉన్నాడు. చర్చికి ఒంటరిగా వెళ్లిన 11 ఏళ్ల బాలికను పాస్టర్ డబ్బిలిస్తానంటూ గదికి తీసుకెళ్లాడు. తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. గదిలోకి తీసుకెళ్లి బట్టలు చించి…అసభ్యకరమైన సినిమాలు చూపించాడని…తరువాత తనపై అత్యాచారం చేశాడని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక కొన్నిరోజుల పాటు విషయం దాచిపెట్టింది. కన్నవాళ్లకు అనుమానం వచ్చి అడగ్గా అసలు విషయం బయటపెట్టింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)