అసోంలో క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తరువాత హిందువులు….ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవంబర్ 24న, అసోం… కచార్ కటిగోరా తహసీల్లోని మహదేవ్తిల్లా ఆలయంలోకి చొరబడిన క్రైస్తవులు కొందరు శివలింగాన్ని, త్రిశూలాన్ని, అక్కడున్న మర్రి చెట్టును ధ్వంసం చేశారు. ఈ దారణంపై హిందూసంఘాలు సీరియస్ అయ్యాయి. హిందూరక్షాదళ్, హిందూ ఛత్రసంఘ్ వంటి హిందూసంస్థల సభ్యులు జిల్లా డిప్యూటీ కమిషనర్ కు మెమొరాండం సమర్పించారు. ఆ తరువాత అంటే నవంబర్ 29న వందమందికిపైగా హిందువులు మహాదేవ్ తిల్లాలోనికి వెళ్లి పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలతో శివలింగాన్ని తిరిగి ప్రతిష్టించారు. క్రైస్తవులు అక్కడున్న దాదాపు 250 ఏళ్లనాటి పవిత్ర మర్రి వృక్షాన్ని నరికేయడంతో అదే ప్రాంతంలో మర్రిమొక్కను నాటారు.
ఈ పూజా కార్యక్రమంలో పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. స్థానిక మణిపురి హిందువులతో పాటు హిందూ ఛాత్ర సంఘం, హిందూ రక్షాదళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమిష్టి పోరాటం వల్లే ఇది సాధ్యమైందని స్థానికులంటున్నారు.
ఈ వ్యవహారం ఇంతటితో ముగియలేదని…ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఖాసీ వర్గానికి చెందినవారు ఉన్నారు. వారిలో 85 శాతం మంది క్రైస్తవం స్వీకరించారు. మరికొందరు బయటి వ్యక్తుల అండతో స్థానిక ఖాసీ క్రైస్తవులే ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అటు మణిపూర్లో కూడా మతం మారిన క్రైస్తవులు రెచ్చిపోతున్నారు. అటవీశాఖ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. వాళ్ల జోలికి ఎందుకు వెళ్తున్నారని హిందువులనే బెదిరిస్తున్నారని హిందూసంస్థల ప్రతినిధులు వాపోతున్నారు.