ఇస్లాం,క్రైస్తవ మతాల వారు ఎంత ఉన్నత పదవులలో ఉన్నా వాళ్ళ మతంగురించి మాట్లాడకుండా ఉండలేరు అని చెప్పటానికి గతంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న మహమ్మద్ హమీద్ అన్సారీ మాట్లాడిన మాటలు మనకు గుర్తుకు ఉండి ఉంటాయి , అట్లా తాజాగా క్రైస్తవుడైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జాన్రోస్ ఆస్టిన్ జయలాల్ ” కరోనా నుండి ప్రపంచాన్ని బయటపడేసేది క్రైస్తవం అల్లోపతే నని ” వాదిస్తున్నాడు , దీనికి మన ఉదారవాద మేధావులు, సెక్యూలర్ వాదులు ఏమంటారో ? వారు ఇంకా నోరు తెరవలేదు బహుశా తెరవరు కారణం మనందరికీ తెలుసు దానిపై కోర్ట్ మాట్లాడిన విషయాలు గమనిద్దాము . . . . . . . . . . . . .. . . . .
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జాన్రోస్ ఆస్టిన్ జయలాల్ హిందుత్వం , ఆయుర్వేదాన్ని విమర్శిస్తూ వరల్డ్ న్యూస్లో కథనాలను ప్రచురించారని, ‘క్రిస్టియన్ టుడే’ మరియు ‘హగ్గై ఇంటర్నేషనల్’ లో ఇంటర్వ్యూ, మరియు వివిధ టీవీ న్యూస్ ఛానెళ్లలో అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం యొక్క సంచికనుఅట్లా వివిధ పత్రికలలో రాసిన వ్యాశాలలో, బాబా రామ్దేవ్ తో ఆయన చేసిన టీవీ చర్చలలో అంశాలను పరిగణలోకి తీసుకొని రోహిత్ ఝా IMA ప్రెసిడెంట్ జయలాల్పై ఢిల్లీలో కోర్ట్ ఎక్కాడు. ఐ ఎం ఓ అధ్యక్షుడు ఏ జై జై లాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ హిందువులను క్రైస్తవ మతం లోకి మార్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడ ని కేస్ లో పే ర్కొన్నాడు . ఈమధ్య మార్చి 30 నాడు నేషన్ వరల్డ్ న్యూస్ పేపర్ లో అల్లోపతి ఆయుర్వేదం మందుల పై చెయ్యి అన్నాడు. జై లాల్ ఐఎంఏ వేదికలపైన పత్రికలలో హిందుత్వానికి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా మాట్లాడటం నిరోధించాలనికోరాడు . క్రైస్తవ మిషనరీ లాగా వ్యవహరిస్తూ మాట్లాడుతున్నాడు, covid 19 సమయంలో మెడికల్ విద్యార్థులను డాక్టర్ను మరియు కరోనా రోగులను మతం మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడని తన నోట్ లో తెలియజేశాడు.అట్లాగే డాక్టర్ జయలాల్ వ్రాసిన ఒక వ్యాసంలో” యేసు క్రీస్తు ప్రేమను పంచుకోవాలని కోరుకుంటున్నానని, మరియు వ్యక్తిగతంగా వారిని రక్షించేది యేసు మాత్రమేనని అందరికీ భరోసా ఇస్తున్నాడు . మునుపటి అనేక మహమ్మారి వ్యాధుల నుండి ప్రపంచిన్ని బైటపడేసింది క్రీస్తు దయ చర్చిలేననిని ఇప్పుడు ఈ కరోనా వ్యాధి నుండి యేసు దయయే కాపాడుతుందని ” అంటున్నాడు . డాక్టర్ జయలాల్ఒక సందర్భంలో ” మోడీ ప్రభుత్వం ఆయుర్వేదంలో సాంస్కృతిక విలువలుఉన్నాయని , అందుకే ఆయుర్వేదంపై నమ్మకం ఉందని అంటున్నది ,కానీ కోవిద్-19సమయంలో ఆయుర్వేదం స్థానంలో అల్లోపతి వైద్యంతో నే ప్రయత్నాలు జరుగుతున్నాయని డాక్టర్ జయలాల్ ఎద్దేవచేసాడు.
కేసు విచారించిన అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ బాధ్యతాయుతమైన అధ్యక్ష స్థానంలో ఉండి “క్రైస్తవ మతం మరియు అల్లోపతి ఒకటేనని అవి పాశ్చాత్య ప్రపంచం యొక్క బహుమతి అని చెప్పడం‘సరికాదని ’ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి చేసే సాధారణ వ్యాఖ్యలు కూడా సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ” IMA వేదిక మీద నుంచి క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం ఆయుర్వేదం కించపరచడం మొదలైన వ్యాఖ్యలు మీ నుండి ఆశించలేము. covid 19 చికిత్సలు ఆయుర్వేదం కంటే అల్లోపతి దే పై చెయ్యి అని మాట్లాడటం ఐఎంఏ వేదికలపై నుంచి క్రైస్తవ మత ప్రచారం చేయటం హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం హిందూ మతానికి నష్టం కలిగించటం , కాబట్టి అటువంటి వేదికల నుంచి ఏ మతానికి ప్రచారం చేయవద్దని ఆదేశించారు, దానికి జై జై లాల్ అటువంటి వ్యాఖ్యలు ఇక చేయనని కోర్టుకు హామీ ఇచ్చాడు, దానితో అతనిపై కోర్టు ఎటువంటి నిషేధ ఉత్తర్వులు జారీచేయలేదు.