https://twitter.com/ANI/status/1372751542416121856
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కోట్లమంది దీని బారినపడగా.. లక్షల మంది మరణించారు. అయితే ఎట్టకేలకు ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ రెడీ అవ్వగా.. అందులో భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ను.. ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి. అంతేకాదు.. భారత ప్రభుత్వం కూడా కొన్ని దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఆఫ్రికా దేశమైన జమైనాకు భారత్ వ్యాక్సిన్ సహాయం చేసింది. దీంతో ప్రముఖ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రదాని మోదీకి, భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాములు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు