ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఇటీవలే కరోనా సోకడంతో ఆయన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఇవాళ పరిస్థితి విషమించింది. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో మద్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. వయసు మీద పడటం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కొన్నిరోజులుగా ఐసీయూలోనే ఉంచి సీపీఏపీ థెరపీ చేస్తున్న ప్రయోజనం లేకపోయిందన్నారు.
ప్రకృతిని పరిరక్షించుకోవాలని…చెట్లను బతికించుకోవాలనే పిలుపుతో చిప్కో ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ వేత్తలెందరికో ఆయన ప్రేరణగా నిలిచారు.