భారత హద్దుల్లోకి చొచ్చుకొస్తూ చైనా సైనికులు వీధి రౌడీల్లా వ్యవహరించారని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ప్రతిఏటా చొరబాట్లకు తెగబడుతూ భారత సైనికుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గాల్వాన్ ఘర్షణ చైనాస్థాయిని అంతర్జాతీయ స్థాయిలో తగ్గించిందని , ఆదేశ పరువు పోయిందని నాడు ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆయన అన్నారు. ముళ్లతీగల్ని దాటుకుంటూ మేకలున్న కర్రలతో భారత సైనికులపై దాడిచేయడం వారికి అలవాటైందని మండిపడ్డారు..