అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లా బిషింగ్ లో 17 ఏళ్ల యువకుడిని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) కిడ్నాప్ చేసింది. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్లినప్పుడు అపహరించారు. మరో యువకుడు ఎలాగోలా చైనా సైన్యం నుంచి తప్పించుకున్నాడు. ఈ యువకుడి విడుదలకు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖను ప్రయత్నాలు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ పార్లమెంటు సభ్యుడు తపిర్ గావో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
యువకుడి అపహరణ ఆరోపణలపై నివేదిక కోసం హాట్లైన్ ద్వారా చైనీస్ కౌంటర్ పార్ట్ తో సంప్రదింపులు జరిపామని, ప్రోటోకాల్ ప్రకారం బాలుడిని గుర్తించి తిరిగి ఇవ్వడానికి PLA నుండి సహాయం కోరినట్లు భారత సైన్యం ఒక ట్వీట్లో పేర్కొంది.