సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణయంపై భారత్ ఇప్పటివరకు నోరు మెదపలేదు కానీ అమెరికా ఘాటుగానే స్పందించింది. సిగ్గుచేటు చర్య అంటూ అభివర్ణించింది.
2020 లో జూన్లో సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికులూ భౌతికదాడులకు దిగాయి. ఈ ఘటనలో భారత సైనికుల చేతిలో దెబ్బలుతిన్న ఆర్మీ అధికారి క్వి ఫాబోవాను వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలే రన్ కోసం టార్చ్ బేరర్ గా నియమించింది. దీనిపై అగ్రరాజ్యం మండిపడింది. చైనా క్రీడలను కూడా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని సిగ్గుచేటైన చర్యగా పేర్కొంది.
‘వీగర్లపై దాడి చేసిన 2020లో భారత్ పై దాడి చేసిన సైనికాధికారిని ఒలింపిక్స్ కు టార్చ్ బేరర్ గా ఎంపిక చేయడం అంటే రెచ్చగొట్టడమే. వీగర్లకు, భారతదేశసార్వభౌమాధికారానికి మేం మా మద్దతు కొనసాగిస్తాం’ అంటూ ట్వీట్ చేసింది.
అటు గాల్వన్ లోయలో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో చైనా పెద్దమొత్తంలో సైనికుల్ని కోల్పోయిందంటూ ఆస్ట్రేలియన్ పరిశోధనాత్మక పత్రిక ది క్లాక్సన్ ఓ కథనాన్ని ప్రచురించింది.
నాటి ఘర్షణల్లో తమ సైనికులు నలుగురే పోయారని చైనా నమ్మబలుకుతోందని కానీ..అంతకు చాలా ఎక్కువ సంఖ్యలో సైనికులు చనిపోయారనీ పేర్కొంది. ఆఘర్షణల్లో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా అంతకన్నా ఎక్కువగానే తన సైనికుల్ని నష్టపోయినట్టు సమాచారం.

Indian and Chinese soldiers at Galwan valley(Galwan Clash 2020)