ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర్కొంది.మెక్కిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను పరిశీలించి ఈ నివేదిక రూపొందించింది. ప్రపంచ ఆదాయంలో 60 శాతం కన్నా ఎక్కువ కల్గిన ఈ పది దేశాల ఆర్థిక వ్యయాలను పరిశీలిస్తున్న మెక్ కిన్సె అండ్ కో ఈ వివరాలను వెల్లడించింది.
మెకన్సీ కంపెనీ ప్రకారం 60 శాతం సంపద ఆదేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్లు .
ప్రపంచ నెట్ వర్త్ 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, ఇది 2000లో 156 ట్రిలియన్ డాలర్లు అని తెలిపింది. చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని వివరించింది. 2000వ సంవత్సరంలో చైనా సంపద 7 ట్రిలియన్ డాలర్లు ఉండేదని, ప్రస్తుతం ఇది 120 ట్రిలియన్ డాలర్లకు చేరిందట. అయితే చైనా, అమెరికాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే పోగుపడిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ సంపన్న కుటుంబాలు మరింత సంపదను పోగు చేసుకుంటున్నాయని వివరించింది. 68 శాతం గ్లోబల్ నెట్ వర్త్ రియల్ ఎస్టేట్లోనే ఉందని తెలిపింది.
మెకన్సీ ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2020లో సంపద 156 ట్రిలియన్ డాలర్ల నుంచి 514 ట్రిలియన్ల డాలర్లుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దాంట్లో ఒక్క చైనాలోనే సంపద మూడో వంత పెరిగినట్లు తేల్చేశారు. 2000 సంవత్సరంలో ఏడు ట్రిలియన్ల డాలర్లు ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరిన తర్వాత ఆ దేశ సంపద దూసుకెళ్తున్నట్లు మెకన్సీ తన రిపోర్ట్లో తెలిపింది. మరో వైపు అమెరికాలో ప్రాపర్టీ విలువలు పెరిగినా.. ఆ దేశ సంపద 90 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు దేశాల్లోనూ పది శాతం సంపద సంపన్నుల వద్దే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక మెకన్సీ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం నికర సంపద మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషినరీ, ఎక్విప్మెంట్, ప్రాపర్టీ, పేటెంట్స్ లాంటి వద్ద కొంత బ్యాలెన్స్ సంపద ఉన్నట్లు గుర్తించారు.
ఈ నివేదిక ప్రకారం రెండు దశాబ్దాల్లో నికర ఆస్తుల విలువ అమాంతంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్థూల జాతీయోత్పత్తి పడిపోయింది. దీని ద్వారా ఆస్తుల విలువ పెరిగి.. వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి దీర్ఘకాల సగటు కంటే దాదాపు 50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంపద వృద్ధి చెందడం పలు దుష్ఫ్రబావాలకు దారి తీసే అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణానికి మించి ఈ ఆస్తుల విలువ పెరగడం అనేక ప్రశ్నలను రేకేత్తిస్తుంది. రియల్ ఎస్టేట్ విలువ పెరగడం వల్ల నివాసాలను అనేక మంది కొనుగోలు చేయలేక ఇబ్బందులకు గురౌతున్నారు. దీని వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. 2008లో అమెరికాలో గృహలకు సంబంధించి బబుల్ ఇలాగే పేలిపోయింది. దీనివల్ల ప్రాపర్టీ డెవలపర్స్ కూడా ఇబ్బంది పడవచ్చు.ప్రపంచ జీడీపీని పెంచడం కోసం ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడమే దీనికి ఏకైక పరిష్కారమంటోంది మెకన్సీ నివేదిక.