గాల్వాన్ ఘర్షణ.. జిత్తుల మారి చైనా.. ఎట్టకేలకు ఇలా దొరికిపోయింది
Four Chinese soldiers, who were sacrificed in last June's border conflict, were posthumously awarded honorary titles and first-class merit citations, Central Military Commission announced Friday. A colonel, who led them and seriously injured, was conferred with honorary title. pic.twitter.com/Io9Wk3pXaU
— People's Daily, China (@PDChina) February 19, 2021
జిత్తుల మారి నక్క డ్రాగన్ కంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజాల్ని మింగేసి.. అబద్దపు ప్రచారాలను చేయడంలో చైనాను మించి మరోకటి ఉండదు. అంతేకాదు.. నమ్మక ద్రోహం, వెన్నుపోటు పొడవడం ఆ కమ్యూనిస్టు జింగ్ పింగ్ సర్కార్కు అలవాటే. గతేడాది జూన్ 15వ తేదీన గాల్వాన్ లోయలో భారత సైనికులకు, చైనా సైన్యానికి మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. వీరమరణం పొందిన సైనికుల అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించారు. అయితే భారత సైనికుల చేతిలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా ప్రాణనష్టాన్ని చవిచూసింది. దాదాపు 43 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పలు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. అసలు తమ సైనికులు ఎవ్వరు కూడా మరణించలేదని పేర్కొంది.
అయితే చైనా ప్రకటన తర్వాత.. కొద్ది రోజులకు చైనా సైనికుల సమాదులకు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ చిత్రంలో ఓ 19 ఏళ్ల సైనికుడు గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఆ చిత్రాలు కూడా ఫేక్ అన్నట్లు చైనా చెప్పుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఎట్టకేలకు చైనా ప్రభుత్వం గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా అంగీకరించింది. అంతేకాదు వీరికి హానరరీ టైటిల్తో సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది. ఆ రోజు చైనా సైన్యం తరఫున నాయకత్వం వహించిన కల్నల్కు కూడా అవార్డును ప్రకటించింది. ఆ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిలో చెన్ హాంగ్జున్, చెన్ జియాన్గ్రాంగ్, గ్జియో సియువాన్, వాంగ్ జోరాన్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని చైనాకు చెందిన పీపుల్స్ డైలీ కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన కల్నల్ కూడా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది.