రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎదులాపురం నగరంలో రెండు రోజులపాటు (25,26 వ తేది లు) బాల ప్రశిక్షణ శిబిరం ఒక ప్రైవేటు పాఠశాలలో నిర్వహించడం జరిగింది..
ఈ ప్రశిక్షణ శిబిరంలో 8,9,10 వ తరగతులకు చెందిన 310 బాలలు పాల్గొన్నారు.ఈ శిబిరంలో వారికి దేశభక్తుల యొక్క జీవిత గాథలు,వ్యక్తిత్వ వికాసం, కథలు,పాటలు,గోష్ వివిధ రకాల వ్యాయామాలు, మొదలగు వాటి గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ఇందూర్ విభాగ్ కార్యవాహ బలవత్త్రీ గణేష్ జి హాజరయ్యారు.జిల్లా ప్రచారక్ మధుసూదన్ భగత్,జిల్లా కార్యవాహ,జిల్లా నలుమూలల నుంచి సంఘ వివిధ బాధ్యత ఉన్న కార్యకర్తలు…. మొదలగు వారు హాజరయ్యారు.26వ తేదీ సాయంత్రం(సోమవారం) సమారోప్ కార్యక్రమంలో ప్రదర్శనలు చూడటానికి జిల్లా నలుమూలల నుంచి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి..