అటు బల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవితఖైదు అనుభవిస్తున్న వారందరినీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ రిమీషన్ పాలసీ ప్రకారం విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆనేపథ్యంలోనే సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై విచారణ జరిపేందుకు పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. వారి విడుదలతో న్యాయవ్యవస్థపైనే నమ్మకం పోయిందని బాధితురాలు బల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేశారు.
విడుదలైన వారంతా కూడా పదిహేనేళ్లపాటు జైలుజీవితం గడిపారు. వారిలో ఒకరు మాత్రం విడుదలచేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం రిమీషన్ గురించి పరిశీలించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దీంతో గుజరాత్ సర్కారు ఓ కమిటీని నియమించింది. నివేదికను పరిశీలించి వారిని విడుదల చేసింది.
అయితే ఈ రిమీషన్ను ఉపసంహరించాలని కోరుతూ దాదాపు 6,000 మంది సుప్రీంకోర్టును కోరారు. ఈ స్టేట్మెంట్పై సంతకాలు చేసినవారిలో యాక్టివిస్టులు సయేదా హమీద్, జఫరుల్ ఇస్లామ్ ఖాన్, రూప్ రేఖ, దేవకి జైన్, ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవిత కృష్ణన్, మైమూనా మొల్లా, హసీనా ఖాన్, రచన ముద్రబోయిన, షబ్నమ్ హష్మి తదితరులు ఉన్నారు.
https://twitter.com/republic/status/1561956091881086976?s=20&t=lS0EHn4NMUix4lXCXN5FIg