కశ్మీర్లో హిందువులపై జరిగిన మారణహోమం, పండిట్ల తరిమివేత ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ ది కశ్మీర్ ఫైల్” కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఏడు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమాకు పన్ను వసూలు చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే దేశవ్యాప్తంగా పన్నురద్దు చేయాలని ప్రధాని మోదీని కోరారు చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్. ఈ చిత్రంపై సెంట్రల్ జిఎస్టిని తొలగించి.. పన్ను రహిత చలన చిత్రాన్ని కాస్త పాన్-ఇండియా చిత్రంగా మార్చాలని ఆయన ప్రధానమంత్రిని అభ్యర్థించారు.
“బిజెపి ఎమ్మెల్యేలు ‘కశ్మీర్ ఫైల్స్’ని పన్ను రహితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంపై సెంట్రల్ జిఎస్టిని తొలగిస్తున్నట్లు ప్రకటించవలసిందిగా గౌరవనీయులైన ప్రధాన మంత్రిని నేను అభ్యర్థిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి పన్ను రద్దు చేయాలి. మా ఎమ్మెల్యేలంతా సినిమా చూడాలని నేను ఆహ్వానించాను. ఈ రోజు గౌరవనీయులైన అసెంబ్లీ సభ్యులందరం రాత్రి 8 గంటలకు రాజధాని రాయ్ పూర్ లో సినిమా చూస్తున్నాం ” అని ట్వీట్ చేశారు.
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’చిత్రాన్ని ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక సహా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రహితంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)