ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూసేందుకు పూణె వెళ్లిన కాళీచరణ్ శివాజీ గురించి తన దృక్కోణాన్ని వివరించారు. ఆనంద్ దిఘే, హిందుత్వంపై రాజ్ థాకరే ఇటీవలి వైఖరి, అలాగే అక్బరుద్దింగ్ ఒవైసీ ఇటీవల ఔరంగజేబ్ సమాధిని సందర్శించడం వంటి పలు అంశాలపై కాళీచరణ్ మహారాజ్ తన అభిప్రాయాలు వెల్లడించారు.
“ధర్మవీర్ ఆనంద్ దిఘే ఒక రాజర్షి. రాజా అంటే రాజకీయాల్లో ఉన్నవాడు, రుషి అంటే ధర్మం కోసం నిలబడేవాడు. ఆనంద్ దిఘే ఈ రెండింటి కలయిక, అందుకే అతను రాజర్షి అయ్యాడు. ధర్మం కోసం ఆయన చేసిన కృషి ఇతరులకు ఆదర్శం. భారతదేశంలో హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ప్రజలు ఆయన అడుగుజాడల్లో నడుస్తారని నేను ఆశిస్తున్నా.. నేను కూడా అదే చేస్తున్నా అనే ఒకే ఒక్క కారణంతో ఇక్కడికి వచ్చి సినిమా చూశాను” అని అన్నారు.
నిజమైన హిందువు ఎలా ఉండాలో చక్కగా వివరించారు కాళీచరణ్ మహారాజ్. “హింసయతి దుష్ట దుర్గుణానాం సః హిందుః.. అంటే తన స్వంత చెడు లక్షణాలను చంపుకుని, సమాజంలో చెడు ధోరణులను అంతమొందించేవాడు హిందువు. ప్రతి హిందూ దేవత దగ్గర ఆయుధం ఉందడానికి అదే కారణం. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి మన దేవతలు కూడా యుద్ధాలు, పోరాటాలు చేశారు. దేశాన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం హింసకు పాల్పడడమే మన ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్, మహారాణా ప్రతాప్, శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, కాళి, దుర్గ, చండీ, చాముండి సహా శివుడు మనకు చూపిన మార్గం అది. దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆయుధాలను ప్రయోగించే మార్గాన్ని ప్రతి ఒక్కరు చూపారు. కావున భగవద్గీతలో చెప్పబడినట్లుగా, ఈ మహానుభావులు చేసినట్లే మనం కూడా చెడుతో పోరాడే మార్గాన్ని అనుసరించాలి. మన సైన్యం, పోలీసు బలగం ఎలా ఉందో మనం కూడా అలాగే హింసాత్మకంగా ఉండటం నేర్చుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయం లేదు”.
శాస్త్రేణ రక్షితే రాష్ట్రే శాస్త్రచర్చ ప్రవర్తే అంటే ‘ఆయుధాలతో రక్షించబడిన దేశంలోనే విజ్ఞాన చర్చలు జరుగుతాయి’. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలను ముస్లింలు పగలగొట్టి తగలబెట్టడానికి ఏకైక కారణం అక్కడ కేవలం జ్ఞానభాగం ఉండడమేనని గుర్తు చేశారు సంత్ కాళీ చరణ్. అయితే మెరుగైన ప్రతిఘటన ఉంటే, మనం జ్ఞానాన్ని కాపాడుకునేవాళ్ళం, ఈ రోజు భారత్ విశ్వ గురువుగా ఉండేది. భారతదేశం ఈ భూగోళంపై చక్రవర్తి సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించి ఉండేది అనీ అన్నారు కాళీచరణ్.
ప్రవీణ్ టార్డే ధర్మవీర్ సినిమాకు దర్శకత్వం వహించారు. రచన కూడా ఆయనే. ప్రసిద్ధ మరాఠీ నటుడు ప్రసాద్ ఓక్ ఈ చిత్రంలో ఆనంద్ దిఘే పాత్రను పోషించారు.