బీహార్ జార్ఖండ్ బంగాల్ ఒడిస్సా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖమైన పండుగగా నిర్వహించబడే “ఛత్” పూజ… అనగా మంత్రాలు ఏవీ లేకుండానే యజ్ఞాలు ఏవి లేకుండానే పండితులైన బ్రాహ్మణులెవ్వరు లేకుండానే… తమకు తాముగా భక్తిశ్రద్ధలతో ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అర్చించే పండుగ ఇది… నిన్నటి రోజు ఉదయించే సూర్యుణ్ణి స్వాగతించి పూజిస్తే నేడు అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పూజిస్తారు రేపు కూడా ఉపవాసం పూర్తిచేసి మూడవరోజు ఉత్సాహంతో పండుగను నిర్వహిస్తారు…. ఇలా మూడు రోజుల పాటు కొనసాగే ఈ పండుగ సాధారణ వ్యక్తులు ముఖ్యంగా మహిళలు తల్లులు తమకు తాముగా వ్రతము పూజ నిర్వహించుకుని గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు ప్రత్యక్ష దైవం సూర్యభగవానునికి పండ్లు చెరుకు గడలు పాలు చెరువు లేదా నీటి ప్రవాహాలలో నిలబడి అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పిస్తారు… ఇస్లాం దుర్మార్గపు ఆక్రమణ సమయంలో ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి నిర్వహించుకున్న పండుగగా దీన్ని మనం గుర్తించవచ్చు.