తమిళనాడు బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడు బాలచందర్ దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు దుండగులు ఆయన్ని చెన్నైలో హత్య చేశారు. చింతాద్రిపేటలో ఆ గ్యాంగ్ ఈ ఘాతుకానికి పాల్పడింది. బాలచందర్ పీఎస్ఓ(పర్సనల్ బాడీగార్డ్) బాలకృష్ణన్ రాకముందే, ముఠా రెండు కార్లలో సంఘటన స్థలం నుంచి పారిపోయారు. మరో బీజేపీ కార్యకర్త హత్య నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ఆందోళనలను సృష్టించింది. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామి నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. 20 రోజుల్లో 18 హత్యలతో చెన్నై “హత్యల నగరం”గా మారిందని ఆరోపించారు.
ఇది వరకు ఇలాగే బీజేపీ కార్యకర్త రాధాకృష్ణన్, అతని భార్య రేణుకపై PFI ఉగ్రవాదులు దాడి చేశారు. రాధాకృష్ణన్ కన్యాకుమారి జిల్లా పుదుక్కడై సమీపంలోని పనంగల్ముక్కై నివాసి. అతను తన భార్య రేణుకతో కలిసి ఆఫీసుకు వెళ్తున్నాడు. బైక్పై మెయిక్కోడు సమీపంలోని తింగల్నగర్ మీదుగా వెళుతుండగా రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు సభ్యుల ముఠా వారిని అడ్డగించారు. గుంపు ఇనుప రాడ్లతో వారిపై దాడి చేసింది. ఈ దాడిలో రాధాకృష్ణన్కు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని భార్యపై కూడా ముఠా దాడి చేసింది. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నలుగురు సభ్యుల ముఠా ఘటనా స్థలం నుంచి పరారైంది.