శ్రీనగర్ను మొత్తం దేశంతో అనుసంధానించే రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది.. గోల్డెన్ జాయింట్గా పిలుచుకునే ఈ వంతెనను చినాబ్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు శ్రమించి సకాలంలో నిర్మించారు..
1315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తు ఉన్న ఈ బ్రిడ్జ్… పారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తు కన్నా ఎక్కువ. 476 మీటర్లు విల్లు ఆకారంలో, ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వే సెక్షన్లో ఈ బ్రిడ్జ్ను నిర్మించారు..
ప్రపంచంలోనే నదికి రెండు వైపుల మాత్రమే సపోర్ట్ చేసుకుని.. మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ఏడోది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకు 1,400 మంది శ్రమించారు..గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా..ఈ వంతెన చెక్కు చెదరదని చాలా ధీమాగా చెబుతున్నారు ఇంజనీర్లు.
https://twitter.com/AshwiniVaishnaw/status/1558433060617498624?s=20&t=wiZvUldiWmt-jmvdQFN3kg