ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూనే క్రైస్తవంలోకి మారిన వాళ్లు చాలామంది కనిపిస్తారు. మరి కొంతమందిని క్రైస్తవంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎస్సీ హోదాని మాత్రం వదులుకోరు. తద్వారా అసలైన ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది.
………
చర్చికి వెళ్తున్నప్పటికీ,, ప్రార్థనల్లో పాల్గొంటున్నప్పటికీ … తాము క్రైస్తవులం కాదని,, హిందువులమే అని చాలామంది వాదిస్తూ ఉంటారు. ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించు కునేందుకు ఇటువంటి అడ్డ గోలు వాదనలు వినిపిస్తూ ఉంటారు. క్రైస్తవ మతారాధన ను అడ్డుకోలేరు అని వితండవాదం చేస్తూ ఉంటారు. దీని మీద స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది.
…………..
చర్చిలో పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్లను .. పూర్తిస్థాయిగా క్రైస్తవులుగా గుర్తించవచ్చు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చర్చిలో పెళ్లి అంటే క్రైస్తవాన్ని అంగీకరించినట్లే అని,, బాప్టిజం వంటి సాంప్రదాయాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. అటువంటి వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని స్పష్టత ఇచ్చింది. చర్చిలో పెళ్లి సర్టిఫికెట్లు కానీ,, ఫోటోలు కానీ చూపించినట్లైతే ..వాళ్ల ఎస్సీ హోదాను రద్దు చేయవచ్చు అని సంచలన తీర్పు వచ్చింది.
…….
కేసు వివరాలు చూస్తే.. తమిళనాడులోని తేరూర్ పట్టణ పంచాయతీ చైర్ పర్సన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఆముదరాణి అనే మహిళ తాను ఎస్సీ ని అని చెప్పుకుంటూ పోటీ చేసి గెలిచారు. ఈ విషయం మీద అయ్యప్పన్ అనే స్థానిక నాయకుడు కోర్టులో పిటిషన్ వేశారు. ఆముదరాణి చర్చిలో పెళ్లి చేసుకున్నారని , క్రైస్తవ లా ప్రకారం పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారని ఆయన సాక్ష్యం చూపించారు. చర్చికి వెళ్తున్నప్పటికీ, ప్రార్థనలు చేస్తున్నప్పటికీ .. తాను హిందువు నే అని, ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందని ఆముదరాణీ వాదించారు. బాప్టిజం తీసుకోలేదు కాబట్టి క్రైస్తవంలోకి మారలేదు అని ఆమె వాదన. ఈ విషయం మీద జస్టిస్ విక్టోరియా గౌరీ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. చర్చిలో పెళ్లి అంటే క్రైస్తవంలోకి మారినట్లే అని తేల్చి చెప్పింది. ఆముదరాణి కి ఎస్సి హోదా వర్తించదు అని స్పష్టం చేసింది.
……….
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది డూప్లికేట్ లు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు చర్చిలో పెళ్లి చేసుకున్న ఫోటోలు దొరికినట్లైతే .. ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించవచ్చు. అసలైన ఎస్సీలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.