తొలుత కంటైనర్లో పీవీసీ పైపులు ఉన్నట్లు నిందితులు అధికారులకు చెప్పుకొచ్చారు. అనంతరం అనుమానంతో అధికారులు కంటైనర్ను చెక్ చేయగా.. అందులో నెమలి ఈకలు బయటపడ్డాయి. ఈ సంఘటన ఐసీడీ తుగ్లకాబాద్ వద్ద చోటుచేసుకుంది. పట్టుబడ్డ నెమలి ఈకలు దాదాపు 2565 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.5.25 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. అయితే చైనీయులు నెమలి ఈకలను వైద్యం కోసం వాడుతారని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.