కరడుగట్టిన నేరస్థుడు చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలునుంచి విడుదలయ్యాడు. ఆరోగ్య కారణాలరీత్యా అతన్ని విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 19ఏళ్ల తరువాత అతన్ని విడుదలచేశారు. శోభరాజ్ ను అటునుంచి ఫ్రాన్స్ పంపేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు పర్యాటకులను హత్యచేసినందుకు నేపాల్ పోలీసులు 2003లో అతన్ని అరెస్ట్ చేశారు. నేపాల్ సుప్రీంకోర్టు జీవితఖైదు విధించింది. నాటినుంచి జైల్లోనే ఉన్నాడు. నేపాల్లో జీవితఖైదు అంటే 20ఏళ్లు. అయితే శిక్షాకాలంలో 75 శాతం పూర్తిచేసుకుని, సత్ప్రవర్తన కలిగినవాళ్లను విడుదలచేస్తారు. దాని ఆధారంగా ఆయన… విడుదల కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆరోగ్యకారణాలతో విడుదలచేయాలని కోర్టు తీర్పునిచ్చింది.