చరణ్జిత్ సింగ్ చన్నీని తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు రాహుల్ గాంధీ.
పంజాబ్లోని లూథియానాలో వర్చువల్ ర్యాలీలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. పేద కుటుంబం నుండి మాకు ముఖ్యమంత్రి కావాలని పంజాబ్ ప్రజలు కోరారని.., అందుకే చన్నీని పార్టీ ఎంచుకున్నట్టు తెలిపారు.
పార్టీ తమ నాయకులు, కార్యకర్తల నుండి అభిప్రాయాలను స్వీకరించింది. ఆటోమేటెడ్ కాల్ సిస్టమ్ ద్వారా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని కూడా కోరింది” అని అన్నారు.