బిహార్ మాజీ ఎంపీ, పేరుమోసిన మాఫిడా డాన్ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలుగువాడైన దళిత ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ఆనంద్ మోహన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం తన కొడుకు చేతన్ ఆనంద్ నిశ్చితార్ధం కోసం అతను పెరోల్ పై బయట ఉన్నాడు. అయితే అతన్ని శాశ్వతంగా విడుదలయ్యాడు. ముఖ్య విషయం ఏంటంటే… అతని విడుదల కోసం నితీష్ సర్కార్ ఇటీవల జైలు మాన్యువల్లో మార్పులు చేసిందని, రాజ్ పూత్ ల ఓట్ల కోసమే నితీష్ ఈ పనిచేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద్ మోహన్ మాత్రమే కాక..రాష్ట్రంలో 14 ఏళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకున్న మరో 26మంది కూడా విడుదల కానున్నారు. అయితే ఆనంద్ మోహన్ విడుదలను తప్పుబడుతున్న కృష్ణయ్య భార్య ఉమ…ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరడు కట్టిన మాఫియాడాన్ ఆనంద్ మోహన్…1996లో జైలునుంచే పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.అంతకు రెండేళ్ల ముందు 1994లో ఏపీకి చెందిన దళిత ఐఏఎస్ అధికారిని హత్య చేయించాడు. నిరుపేద, దళితుడు అయిన కృష్ణయ్య కార్లో వెళ్తుండగా… బయటకు లాగి రాళ్లతో కొట్టికొట్టి, తుపాకీతో కాల్చి చంపారు. నేరం నిరూపణ కావడంతో 2007లో పట్నా హైకోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. 2008లో దానిని కఠిన యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. జైల్లో ఉన్నా రాజకీయం చేశాడు ఆనంద్ మోహన్. తన భార్యని 2010లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014లో ఎస్పీ అభ్యర్థిగా నిలబెట్టాడు.
ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ చేయందుకున్న నితిన్ అగ్రవర్ణాల ఓట్లను దూరం కాకుండా చూసుకోవడానికి రకరకాల మార్గాలు వెదుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఈఏడాది జనవరిలో రాజ్ పూట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ జరుగుతుండగానే…రాజపుత్ర యువకులు ఆనంద్ మోహన్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తారు. ఆ సమయంలో నితిన్ స్వయంగా అన్నమాట ‘మీరు ఆందోళన చెందకండి. నేను చేయాల్సిన ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నా’.
బీహార్ జైలు మాన్యువల్ రూల్స్, 2012 లో 481 క్లాజ్ ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారులను చంపి శిక్ష అనుభవిస్తూ ఉంటే వారు సత్ప్రవర్తన కింద ముందుగా బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే నితీష్ కుమార్ ఈ రూల్స్ ను మార్చి 14 ఏళ్లుగా జైల్లో ఉన్న ఆనందమోహన్ బయటకు వచ్చేటట్టు చూసారు. 2021లో ఆనంద్ మోహన్ ని విడిచిపెట్టాలి అని ఇటువంటి డిమాండ్ వస్తే అప్పుడు బీజేపీతో ఉన్న నితీష్ కుమార్ ఆనంద్ ని విడుదల చేయలేం అని ఖరాఖండిగా చెప్పారు.
మరి ఇప్పుడు నితీష్ ఆనందమోహన్ ని ఇంత అర్జెంటుగా విడిచిపెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఆనంద్ భార్య మరియు కుమారుడు ఇద్దరూ ప్రస్తుత ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ అయినా ఆర్జెడిలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బిజెపిని వదిలేసి ఆర్జెడితో పొత్తు పెట్టుకున్న నితీష్ ప్రభుత్వం సజావుగా సాగాలి అంటే ఆర్జెడి అవసరం తప్పనిసరి. అంతేకాక ఇన్నాళ్ళు బిజెపికి ఉన్న అగ్ర వర్ణ ఓటు బ్యాంక్, హిందూ ఓటు బ్యాంకు అందకుండా పోతాయేమోనని ఆయనకు భయం. అందుకే రాజ్ పూట్ల కోసం ఆనంద్ మోహన్ ను విడిచిపెట్టారన్నమాట.
ఇక ఇటీవలే జరిగిన ఆనంద్ మోహన్ నిశ్చితార్థం వేడుకకు నితీష్ తో పాటు డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్, ఆర్జేడీ చీఫ్ లలన్ సింగ్ కూడా హాజరయ్యారు. బీజేపీతో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడని నితీష్ …ఇప్పుడలా లేరని ప్రజలు అనుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే బీజేపీ ని దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించే సోకాల్డ్ సెక్యులర్లు సామాజిక న్యాయం కోసంమే పుట్టాం అని చెప్పుకునే ఆర్జేడీ, జేడీయూ కలిసి నడుపుతున్న ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలను ప్రశ్నించడం లేదు.
ఇటువంటి విడుదలల పై ఎప్పుడూ గోల గోల చేసే లెఫ్ట్ మేధావులు, మిగతా సెక్యూలర్ లాబీ కానీ, NGO లు కానీ నితీష్ ఈ చర్యపై పెదవి విప్పడం లేదు. అంతేకాదు నితీష్ ని 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.