ఆర్మీలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి పలు మార్పులు చేశారు. కొత్త మార్పులపై ఈ మేరకు సైన్యం ప్రకటన జారీ చేసింది. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో రీజిస్ట్రేషన్ కోసం వీటిని అప్లోడ్ చేశారు. ఈనెల 15నుంచి మార్చి 16 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇతర ర్యాంకులు, అగ్నివీరుల నియామకాల ప్రక్రియలో మార్పులు చేశారు. దీని ప్రకారం నియామక ర్యాలీకి ముందు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీఈఈ నిర్వహిస్తారు.