సొంతపార్టీ ఎంపీలకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాలు కొడుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా మారకుంటే మార్పులు తప్పవని మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశం వేదిగ్గా గట్టిగానే హెచ్చరించారు. మీరేం చిన్నపిల్లలు కాదు. పిల్లలకు చెప్పినట్టు నేను మీకు పదే పదే చెప్పలేను. సభకు రెగ్యులర్ గా హాజరవ్వాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినకుంటే ఎలా అని మోదీ కాస్త కోపంగానే అన్నారు. ఇక నుంచైనా పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరు కండి..మీ తీరు మార్చుకోకుంటే చాలా మార్పులు జరుగుతాయని మోదీ వార్నింగ్ ఇచ్చారు. మొదటి సారి పార్లమెంట్ బయట ఢిల్లీలోని అంబేద్కర్ సెంటర్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించుకున్నారు. జన జాతీయ దివస్ ను పురస్కరించుకుని ఎంపీలు మోదీని సత్కరించుకున్నారు.