తెలంగాణలో కర్ఫ్యూ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ సర్వీస్ వేళల్నీ మార్చారు. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజూ ఉదయం ఆరున్నరకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని..చివరి రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని…అవి రాత్రి 8.45 గంటలలోపు గమ్యస్థానాలు చేరుకుంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ సహకరించాలనీ సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఇక రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన కర్ఫ్యూ వేళలకు అనుగుణంగా , సర్కారు నిబంధనల మేరకు నగరంలో బస్సులు నడవనున్నాయి.