నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న జీ20 నిర్వహణ సదస్సులో పాల్గొన్న బాబు డిజిటల్ నాలెడ్జ్ పై పలు కీలక సూచనలు చేశారు. దీంతో డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్ పై పరమేశ్వరన్ తో మాట్లాడాల్సిందిగా మోదీ సూచించారు. ఐటీని అందిపుచ్చుకుంటూ…యువశక్తిని పూర్తిగా వినియోగించుకుని ప్రణాళికలు రూపొందించగలిగితే 2027 కల్లా భారత్ నెంబర్ వన్ గా ఎదగడం ఖాయమని చంద్రబాబు అన్నారు.