చండీగఢ్ కార్పొరేషన్ లో కాషాయ జెండా ఎగిరింది. మేయర్ గా సరబ్జిత్ కౌర్ ఎన్నికయ్యారు. మేయర్ కుర్చీకోసం ఇరుపార్టీల మధ్య హోరాహోరీ సాగింది. రెండు పార్టీలకు అసలైతే సమాన ఓట్లు పోలయ్యాయి. కానీ ఆప్ కు పడిన ఓ ఓటు చెల్లలేదు. దీంతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ డిప్యూటీ, డిప్యూటీ మేయర్ ఎన్నికను అడ్డుకున్నారు. కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
మొత్తం 35 స్థానాలకు గానూ 14 సీట్లు గెలుచుకుని ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. కానీ మేయర్ ఎన్నికలో బీజేపీకి 13 మంది కార్పొరేటర్లు మద్దతు ఇవ్వగా…ఎంపీ కిరణ్ ఖేర్ ఎక్స్ అఫీషియో ఓటుతో 14 ఓట్లు పడ్డాయి. అటు ఆప్ కు పడిన ఓ ఓటు చెల్లలేదు. దీంతో బీజేపీ అభ్యర్థి సరబ్జీత్ కౌర్ మెజారిటీ సాధించారు.
అటు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికకు వ్యూహాత్మకంగా దూరంగా ఉంది. పార్టీ ఏడుగురు కార్పొరేటర్లూ ఎన్నికలో పాల్గొనలేదు. అకాళీదళ్ కు చెందిన ఓ కౌన్సిలర్ కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
అసలైతే ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. అయితే ఆప్ అభ్యర్థి ఓటు చెల్లుబాటు కాకపోవడంతో కౌర్ ను విజయం వరించింది. అయితే అన్యాయం జరిగిందంటూ ఆప్ సభ్యులు నిరసనకు దిగారు.