సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు.రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన ఉద్యోగులు ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు. 30వేలమందికి పైగా ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. పీఆర్సీతో పాటు తమ 29 డిమాండ్లు పరిష్కరించాల్సిందేనంటూ భీష్మించారు. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారిపై 4కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గాన్ని మూసేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఛలో విద్యుత్ సౌధ కు ఉద్యోగులనుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా ఆందోళనకు తరలివచ్చారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం , జీపీఎఫ్ అమలు వంటి 29 డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
https://twitter.com/PintodeepakD/status/1639165886945988608?s=20