మహారాష్ట్ర నవ నిర్మాణసేన ఆధ్వర్యంలో జూన్ 5 ఛలో అయోధ్య పర్యటన సాగనుంది. దీంతో ముంబైలో ఛలో అయోధ్య పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. అందులో “జై శ్రీ రామ్. నేను నా స్వార్థం కోసం మతతత్వవాదిలా ఉండట్లేదు. నేను ముందు నుంచి మతపరమైన వ్యక్తిని. అయోధ్యకు వెళ్దాం” అని హిందీలో ఉంది.
ఇటీవలో రాజ్ ఠాక్రేను ఉద్దేశించి ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసు. ఓ సభ వేదిగ్గా ఉద్ధవ్ మాట్లాడుతూ… ,“నేను రాజ్ ఠాక్రే లాంటి ఆటగాళ్లను పట్టించుకోను. ఈ ఆటగాళ్ళ ఆటలను ప్రజలు ఇది వరకే అనుభవించారు. కొన్నిసార్లు మరాఠీ ఆట ఆడతారు, కొన్నిసార్లు హిందుత్వా? మహారాష్ట్ర ప్రజలు మీ ఆటల్ని గమనించారు”అని అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఆ ప్రభుత్వం మసీదులు, దేవాలయాల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగిస్తుంటే..మహారాష్ట్ర ఎందుకలా చేయడం లేదని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. ఓ నాసిక్ జర్నలిస్ట్ సహా ముస్లింలు సైతం మసీదుల్లో లౌడ్ స్పీకర్లు సమస్యగా మారాయని…చిన్నపిల్లలు నిద్రపోవడానికి ఆటంకం కలుగుతోందని చెబుతున్నారని రాజ్ గుర్తు చేశారు. ఈ అంశంపైనే త్వరలో విదర్భ, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, తూర్పు మహారాష్ట్ర, మరఠ్వాడాలో మరిన్ని ర్యాలీలు చేస్తానని ఠాక్రే అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)