ఇద్దరు తెలుగుకవులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాలఆనంద్ రాసిన అకుపచ్చ కవితలు పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చింది.ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీన్ పోయమ్స్ కి అది అనువాదం. అందులోని 58 కవితలు కూడా ప్రకృతికి సంబంధించినవే. ఇక మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మపరాగం పుస్తకానికి కూడా సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. పురస్కారం కింద తామ్రఫలకం, 50వేల రూపాయల నగదు అందచేస్తారు.