ధైర్య సాహసాలు ప్రదర్శించే జమ్మూ కశ్మీర్ పోలీసులకి ఇచ్చే మెడల్ [పతకం ] మీద నుంచి షేక్ అబ్దుల్లా చిత్రాన్ని తొలగించి మూడు సింహాల చిహ్నాన్ని ఉంచింది కేంద్ర ప్రభుత్వం.
బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతూ చాలా తెలివిగా భాగపంపిణీ చేసి వెళ్ళారు. ఒకే కుటుంబానికి చెందిన వేరే వేరే పేర్లు కలిగిన వాళ్ళకి భారతదేశాన్ని అప్పచెప్పేసి వెళ్ళాడు. ఎప్పుడెప్పుడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేద్దామా అనే దురాశ తప్పితే దేశం ఏమవుతుందో అన్న ధ్యాస లేదు పంచుకున్న కుటుంబ సభ్యులకి.
షేర్ -e-కాశ్మీర్ ట ! అంటే కాశ్మీర్ పులి అని అర్ధం ! ఈ బిరుదు షేక్ అబ్దుల్లా కి ఇచ్చారు తోటి కుటుంబ సభ్యులు. ఇతగాడు కాశ్మీర్ లో ఏం వరగబెట్టాడు అని కాశ్మీర్ పులి అని బిరుదు ఇచ్చారు ?
జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని అబ్దుల్లా కుటుంబానికి ఇచ్చి మిగతా భారత్ ని నెహ్రూ కుటుంబం పాలనలోకి తీసుకుంది. షేక్ అబ్దుల్లా కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని వినిపించకుండా ఉండడానికి జమ్మూ కాశ్మీర్ కి అన్ని హక్కులు కల్పించాడు నెహ్రూ. బడ్జెట్ లో కాశ్మీర్ కి డబ్బులు ఇవ్వాలి కానీ లెక్కలు అడగకూడదు. ఇలా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇంగ్లాండ్ కి తరలించారో లెక్క లేదు అబ్దుల్లా లు.
తాజాగా కేంద్రం మరో గట్టి చర్య తీసుకుంది!
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకి ఇచ్చే మెడల్ మీద భారత జాతీయ చిహ్నం అయిన మూడు సింహాల గుర్తు ని ఉంచింది. ఇంతకుముందు అదే మెడల్ మీద షేక్ అబ్దుల్లా ఫోటో తో ఇచ్చేవారు షేర్ -e – కాశ్మీర్ అనే పేరుతో.
ఈ అబ్దుల్లా కుటుంబం భారత దేశ ప్రజల పన్ను చెల్లింపు డబ్బుని నెహ్రూ కుటుంబం తో కలిసి బాగానే దోచుకున్నారు. పోలీస్ మెడల్ మీద షేక్ అబ్దుల్లా ఫోటో ఎందుకు అని ఎవరూ అడిగిన పాపాన పోలేదు ఇంతవరకు.
~పార్ధసారధి పోట్లూరి