పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో పని చేస్తున్న పేదవృద్ధ కార్మికుల కోసం డొనేట్ ఎ-పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM) పెన్షన్ పథకంలో మొదటి అడుగు. దీని ద్వారా పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో పని చేస్తున్న పేద వృద్ధ కార్మికుల కోసం ఉపయోగించనున్నారు. న్యూఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించిన కార్మిక, ఉపాధి శాఖామంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ… 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న అసంఘటిత రంగంలోని కార్మికులు పేర్లు నమోదు చేసుకోవచ్చు.
వారి వయస్సును బట్టి ప్రతి సంవత్సరం కనీసం 660 నుండి 2400 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చని సంబంధిత యంత్రాంగం తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 55 నుంచి 200 వరకు పెన్షన్ జమ చేస్తుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)