పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మెన్ వింగ్, రామనాథ్ వెస్ట్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు బరాకబ్దుల్లా నుంచి వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. బాంబుల తయారీకి సంబంధించిన కోర్సుకు సంబంధించి…గజ్వా ఎ హింద్ మిషన్ 2047 కు సంబంధించి ప్రణాళికాపత్రాలు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ లు కూడా ఉన్నాయి.
ఇస్లామిస్ట్ సంస్థ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు, ఫ్రంట్ లను UAPA చట్టం కింద నిషేధిస్తూ భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిషేధానికి ముందు పలుచోట్ల దాడులు నిర్వహించారు. దాడుల్లో IEDలు, ఆయుధాలు, GPS పరికరాలు, నగదుతో పాటు జిహాదీ పత్రాలను భద్రతాసంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. బాంబు తయారీ మాన్యువల్, హైటెక్ కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
GPSతో కూడిన లోరెన్స్ LHR-80 ఫ్లోటింగ్ హ్యాండ్హెల్డ్ VHF పరికరాలు గుర్తించారు. సముద్ర మార్గాలను నావిగేట్ చేసేందుకు అవి ఉపయోగపడతాయి. సముద్ర మార్గం గుండా ఉగ్ర కార్యకలాపాలు, మనీలాండరింగ్ కోసం PFI ఈ పరికరాలను ఉపయోగించేవారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
https://twitter.com/ANI/status/1574938727788744704?s=20&t=ff5Qf4HCiia-S9tNxyQezA
సులువుగా లభించే మెటీరియల్ ను ఉపయోగించి IEDలను ఎలా తయారు చేయాలి’ అనే అంశంపై ఉన్న మాన్యువల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముస్లిం యువతకు బాంబులను ఎలా తయారు చేయాలో తెలిపే విషయాలు వివరంగా ఉన్నాయి. అణచివేతకు గురవుతున్న ముస్లిం యువకుల సాధికారికత కోసం, ముస్లిం యువతను బలోపేతం చేయడం, ముస్లిమేతరుల అవకాశాల్ని దెబ్బతీయడం, వారిని అస్థిరపరచడం, జనాల దృష్టిని ఆకర్షించేలా సమాజంలో బీభత్స సృష్టించడం,దేశంలో కోల్పోయిన ముస్లింల ఆధిపత్యాన్ని తిరిగి సాధించడం వంటి ప్రణాళికకు సంబంధించిన కీలకఆధారాలు గుర్తించారు. సమాజాన్ని అస్థిరపరిచే కుట్రకోసం బాంబులను స్వయంగా తయారుచేసుకోవడం, వాటిని ఎలా తయారుచేయాలో డాక్యుమెంట్లో వివరంగా ఉన్నాయి.
ఇక తమిళనాడుతో పాటు కర్నాటకలో జరిగిన దాడుల్లో పీఎఫ్ఐ నేతల ఇళ్లనుంచి భారీ మొత్తంలో నగదు,కీలక పత్రాలను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. నేర కార్యకలాపాలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నా పలువురు పీఎఫ్ఐ నాయకుల జాబితాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీఎఫ్ఐ ఛైర్మన్గా ఉన్న ఓఎంఏ సలామ్ను తన డిపార్ట్మెంట్ ఆఫ్ కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే పీఎఫ్ఐ చైర్మన్గా కూడా అనధికారికంగా విదేశాలకు వెళ్లడంపై విచారణ జరుగుతోంది.
సలామ్కు అత్యంత సన్నిహితుడు అయిన ఎం మహమ్మద్ ఇస్మాయిల్ నుంచి దాడుల సమయంలో ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించే కుట్రలు డైరీలో ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టించేందుకు సంస్థ వేసిన దుష్ట ప్రణాళికను డైరీ వెల్లడించింది.
పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి నజరుద్దీన్ ఎలమరంపై వివిధ సెక్షన్ల కింద పది కేసులు నమోదయ్యాయి.
PFI జాతీయ కార్యనిర్వాహక మండలి సభ్యుడు పి కోయా, 1978-79లో సిమిలో యాక్టివ్ గా పనిచేసిన అన్సార్, రాజస్థాన్లో మాలి, గుజ్జర్ల మధ్య విభజన సృష్టించడంలో కుట్ర వెనక వాళ్లున్నారు. EM అబ్దుల్ రహిమాన్ 1984లో SIMI ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. SIMI అనుకూల సంస్థ అయిన కరుణ ఫౌండేషన్తో కూడా అనుబంధం కలిగి ఉన్నారు. మరో ఉగ్రసంస్థ హమాస్ కు గతంలో మద్దతు పలికిన అనిస్ అహ్మద్ పీఎఫ్ఐ ప్రధానకార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే.