ప్రభుత్వ ఉద్యోగులు సహా పేదలకు తీపికబురు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది.
డీఏను పెంచడంతో పాటడు… మరో మూడునెలల పాటడు పేదలకు ఉచిత రేషన్ అందించే… ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం సౌకర్యంగా ఉండేలా పది వేల కోట్ల రూపాయలతో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సిఎస్ఎంటి-ముంబై రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార, ప్రసారశాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డీఏ, రిలీఫ్ ఇన్స్టాల్మెంట్ను అందజేయనున్నారు. 2022 జూలై 1 నుంచి ఇది వర్తించనుంది. ఇక పేదలకు ఆహారధాన్యాలను డిసెంబర్ 2022 వరకు ఇవ్వనున్నారు. దీనికి రూ. 44,700 కోట్లు ఖర్చవుతుంది. ఈ పథకం కింద 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా ఐదు కిలోల గోధుమలు మరియు బియ్యం అందజేస్తున్నారు.