రేషన్ కార్డు దారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. లబ్దిదారులకు ఉచితరేషన్ పథకాన్ని పొడిగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం తాజా నిర్ణయంమేరకు 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఒక్కోవ్యక్తికి నెలనెలా 5కిలోల చొప్పున బియ్యం, గోధుమలు ఇవ్వనుంది కేంద్రం.ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజనను జాతీయ ఆహార భద్రతాచట్టంలో 2023 డిసెంబర్ వరకు విలీనం చేయాలని కేబినేట్ మీటింగ్లో నిర్ణయించామని మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు.