కేంద్ర బడ్జెట్2021 : శాఖల వారీగా కేటాయింపులు
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఇబ్బందుల పాలైంది. ఈ పరిస్థితుల్లోనే ఏప్రిల్ 1
నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సారి డిజిటల్ పద్ధతి (ట్యాబ్)లో.. బడ్జెట్
ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఏకంగా గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు.
ఈ బడ్జెట్లో ఎప్పటిలాగే రక్షణ రంగానికి అత్యధికంగా కేటాయించారు. ఆ తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. రూ.4.78
లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించగా.. దీనిలో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఉంది. గతేడాదితో కంపేర్ చేస్తే మూలధన వ్యయం 19 శాతం పెరిగింది. ఈ విషయాన్ని
లోక్సభలో కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత పదిహేను ఏళ్లలో రక్షణ రంగానికి ఈ స్థాయి మూల ధన వ్యయం లేదన్నారు. ఇక వినియోగదారుల వ్యవహారాలు,
ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు రూ. 2,56,948 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత వివిధ శాఖలకు కేటాయింపులను గమనిస్తే..
హోం మంత్రిత్వ శాఖ : – రూ.1,66,547 కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ :- రూ.1,33,690 కోట్లు
వ్యవసాయ, రైతుల సంక్షేమం:- రూ.1,31,531 కోట్లు
రోడ్డు రవాణా, జాతీయ రహదారులు :- రూ.1,18,101 కోట్లు
రైల్వేలు:- రూ.1,10,055 కోట్లు
విద్యా శాఖ :- రూ.93,224 కోట్లు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ :- రూ.73,932 కోట్లు
గృహ, పట్టణ వ్యవహారాల శాఖ :- రూ.54,581 కోట్లు
స్వచ్ఛ భారత్:- రూ.1,41,678 కోట్లు
కేటాయించారు.
కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్కు ప్రత్యేకంగా రూ.35 వేల కోట్లు కేటాయించారు. అంతేకాదు.. ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన అనే కొత్త పథకం ప్రారంభించారు. దీని కోసం రూ.64,180 కోట్లు
కేటాయించారు.