ఈ సెప్టెంబర్ 14 నుండి 27 వరకు అమెరికాలో(UNGA) UN జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలు జరిగాయి . ఆ సమావేశాలలో మధ్య ఆసియా దేశమైనా తజకిస్థాన్ అధ్యక్షుడుఎమోమాలి రహ్మోన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలో కి వెళ్ళటం మధ్య ఆసియా దేశాల ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి పెద్ద సవాల్ అని ఆ సభకు వివరించాడు , అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు మధ్య ఆసియా దేశాలను ఎంతో ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు. ఆ వివరాలు సంక్షిప్తంగా……
ఈ మధ్య జమాయాత్ -ఇ – ఇస్లామీ ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు, మరియు బాల్ఖ్ ప్రావిన్స్ మాజీ గవర్నర్ అతా మొహమ్మద్ నూర్ మధ్య ఆసియా దేశాలు లో పనిచేస్తున్న 39 జిహాదీ సంస్థల జాబితా విడుదల చేశాడు. ఆ సంస్థలు ఇస్లామిక్ స్టేట్ మరియు జమాత్ అన్సరుల్లా నుండి తూర్పు తుర్కిస్తాన్ వరకు ఇస్లామిక్ ఉద్యమం నడిపే ఆ స్వీపర్ సెల్స్ క్రమంగా క్రియాశీలంగా మారుతున్నాయి దానితో ఆదేశాలు ఆందోళనలో పడ్డాయి.ఈ నెల ప్రారంభంలో దుషాన్బేలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం ముందు నూర్ తన జాబితాలోని విషయాలను వెల్లడించాడు.తాజాగా ఆ రాజకీయ నాయకుడి కథనం ప్రకారం ఈ గ్రూపు కు సంబంధించిన ప్రధాన నాయకుడు హాజీ ఫుర్కాన్ ఆఫ్ఘనిస్తాన్లోని బడా ఖాన్ ప్రావిన్స్లో ఉంటాడు హాజీ ఫుర్కాన్ కజకిస్తాన్ పౌరుడు తూర్పు తుర్కేస్తాన్ ఇస్లామిక్ ఉద్యమ ప్రతినిధి ఈ వివరాలు కజికిస్థాన్ నివేదిక ప్రకారం తెలుస్తోంది మొత్తానికి తాలిబాన్ల ప్రభావం ఎక్కువగా మధ్య ఆసియా దేశాలపై పడే అవకాశం కనపడుతున్నది అందుకే ఆ దేశాలు ఆందోళనలో ఉన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల పరిస్థితి:
ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వం చైనా, రష్యా దేశాలతో చేసుకున్నా ఒప్పందం ప్రకారం తమ దేశ సరిహద్దుల నుండి ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇవ్వరు, ఇంకొక ప్రక్క అనేక ఉగ్రవాద గ్రూపులు ఇప్పటికే అక్కడ ఉన్నాయి, అనేక గ్రూపులు అక్కడికి చేరుకుంటున్నాయి వాటి కార్యకలాపాలు కూడా కోన సాగిపోతున్నాయి, వాళ్లు తాలిబాన్లతో సమన్వయం, సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. నిపుణుల అంచనా ప్రకారం వీళ్ళని ఎవరిని తాలిబన్లు బయటకు వెళ్లగొట్టారు . అంతర్గతంగా శిక్షణా శిబిరాలు, ఇంటర్నెట్ ద్వారా ప్రచారం సోషల్ నెట్ వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆఫ్ఘనిస్థాన్లో 46% పైగా ఉన్న తజిక్ లు పట్టు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు . ఇస్లామిక్ గ్రూపులో ఉన్న జాతులు, వివిధ తెగల మధ్య ఆదిపత్య పోరు కొనసాగే అవకాశం కూడా ఉన్నది, మరో ప్రక్క ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రాజకీయ అస్థిరత సైనిక వ్యవస్థ బలహీనతను ఉపయోగించుకోని ఐసిస్, అల్-ఖైదావంటి శక్తివంతమైన సంస్థలు ఈ సమయంలో తమ బలం పెంచుకోవడానికి తీవ్ర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఆప్ఘనిస్థాన్ లో ఉన్న ప్రభుత్వం నిర్బంధించిన ఈ గ్రూపుల కి చెందిన వేలాది మందిని తాలిబాన్ లు విడుదల చేస్తున్నారు, ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం, ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫ్ఘనిస్థాన్ మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాదులకు కేంద్రంగా మారే పరిస్థితులను కొట్టిపారేయలేమని కజికిస్థాన్ అధ్యక్షుడు ఆందోళన వెలిబుచ్చాడు, తమ దేశం ఇప్పటికే ఉగ్రవాదం, తీవ్రవాదం , రాడిక లైజేషన్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లాంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి సిద్ధ పడుతున్నదని చెప్పారు.
మధ్య ఆసియా దేశాల పరిస్థితి:
తాలిబాన్ లు ఆఫ్ఘన్ రాజధానిని ఆగస్టు 15న స్వాధీనం చేసుకున్న వెంటనే ఆ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా సలాఫీ లు , మరియు జిహాదీలు పెద్ద ఎత్తున వేడుక చేసుకున్నారు, ఈ వేడుకలు ( CIS) సి ఐ ఎస్ దేశాలలోని జిహాద్ గ్రూపులు కూడా చేసుకున్నాయి. ఆదేశాలు 1) అజర్బైజాన్ 2) ఆర్మేనియా 3) బెలారస్ 4) జార్జియా 5) కజకిస్థాన్ 6) మోల్డాల్ 7) రష్యా 8) తజకిస్థాన్ 9) తుర్కమేనిస్తాన్ 10) ఉజ్బెకిస్తాన్ 11)ఉక్రెనియా. ఆ దేశాల్లో ఉండే రాడికల్ గ్రూపులు కాబుల్ నుండి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు, ఆదేశాలు వచ్చిన వెంటనే వాటి కార్యకలాపాలు ప్రారంభించడానికి ఎక్కువ సమయం పట్టదు, అవి ఇప్పటికే క్రమంగా క్రియాశీలంగా మారుతున్నాయి , ఆ దేశాలలో ఉన్న సమి ష్టి భద్రత ఒప్పంద సంస్థ లో సభ్య దేశాలు రష్యా, ఆర్మేనియా , బెలారస్ , కజకిస్తాన్, కిర్గిస్థాన్ , మరియు తజికిస్తాన్ దేశాలు తాలిబాన్ల నుండి ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి . ఆదేశాలు కజకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేయడానికి ప్రకటించారు. దాని సన్నాహాలు కూడా ప్రారంభమైనాయి
పాకిస్తాన్ దుస్థితి:
ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ (PIPS) అధ్యనం ప్రకారం పాకిస్థాన్ సైన్యంపై పాకిస్థాన్ తాలిబాన్ (TTP) సంస్థ జులై 1 నుండి సెప్టెంబర్ 15 మధ్య 55 దాడులు చేసింది. ,అందులో ఆత్మాహుతిదాడులు, IED పేలుడు పరికరాలు, స్నిపర్లు ఉపయోగించి చేసిన ఆకస్మిక దాడులలో . 100 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు , కోహిస్తాన్ జిల్లాలోని దాసు హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ సమీపంలో చైనా కాన్వాయ్పై జరిగిన అతి పెద్ద ఆత్మాహుతి దాడిలో 9 మంది చైనా ఇంజనీర్లు మరణించారు.. . ఇది చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు సంబంధించి నది . చైనా అక్కడ భద్రతా దళాలను పెంచింది ఇంకోప్రక్క తాలిబాన్ మరియు హక్కానీ నెట్వర్క్కు బహిరంగంగా మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ మిలిటరీ కూడా మదర్సాలు వివిధ ఉగ్రవాద సంస్థలకు నియామక కేంద్రాలని అంగీకరించాయి.ఒకసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను మదర్సాలలో శిక్షణ పొందుతున్నవారు మతాధికారులు అవుతారా లేదా , ఉగ్రవాదులుగా మారతారా? అని ప్రశ్న అడిగినప్పడు దానికి సమాధానం తెలుసు అయినా ఏమి మాట్లాడలేదు . ఆఫ్ఘనిస్తాన్ ను” ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్” అని తాలిబాన్ ప్రకటించిన తరువాత,స్థానిక మరియు ప్రపంచ ఉగ్రవాదుల ఇంక్యుబేటర్-దారుల్ ఉలూమ్ హక్కానియా సెమినరీ అధిపతి మౌలానా హమీద్ ఉల్-హక్ “మమ్మల్ని జిహాద్ విశ్వవిద్యాలయం అని పిలవకూడదు కానీ తాలిబాన్ క్యాబినెట్ విశ్వవిద్యాలయం” అని పిలవవచ్చు అని చెప్పారు..హక్ తన విద్యార్థులకు తాలిబాన్లు “ఆఫ్ఘనిస్తాన్లో తిరుగు లేని శాంతి మరియు భద్రతను” స్థాపించారనిచెప్పారు . పాకిస్తాన్లో కూడా ఇలాంటి మార్పును “ప్రేరేపించాలని” చెప్పారు.
మొత్తం మీద ఆఫ్ఘన్ పరిణామాలు ప్రపంచంలోని అన్నిదేశా లపైన ప్రభాచూపిస్తోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లకు ఎటువంటి సహకారము అందిస్తున్నది అనే విషయంపై అమెరికా పరిశోధన ప్రారంభించింది, ఆఫ్ఘన్ పరిణామాలు పాకిస్తాన్ మీద ఎట్లా చూపిస్తాయి, ప్రపంచం మీద ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ది జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉన్నది..
Courtesy : రాంపల్లి మల్లికార్జున్