ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులను తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు అక్కడినుంచి 11 వేల మందిని దేశానికి తీసుకువచ్చామని కేంద్రం సుప్రీంకు నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన సుప్రీం కేంద్ర ప్రభుత్వ చర్యలను మెచ్చుకుంది. అయితే ఇంకా అక్కడున్న వారి గురించి ఆందోళన చెందుతున్న ఇక్కడి కుటుంబసభ్యుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
యుద్ధాలతో కొత్తగా సాధించేదేం ఉండదని…ఇప్పటికైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయుల గురించి తాము ఆందోళన చెందుతున్నామని..అయితే వారి తరలింపులో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. మరో ఏడువేలమంది భారతీయుల్ని ఉక్రెయిన్ నుంచి తరలించాల్సి ఉంది.