
File Photo
అసోం సీఎం హిమంత శర్మ భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఆయనకు సీఆర్పీఎఫ్ (CRPF) పోలీసులు జడ్ కేటగిరి భద్రత ఇస్తున్నారు. 2017లో సీఆర్పీఎఫ్తో జడ్ కేటగిరి భద్రత ఉన్నా..అది రాష్ట్రం వరకే వర్తించేది. ఇకనుంచి దేశవ్యాప్తంగా అసోం సీఎం ఎక్కడ తిరిగినా ఈ భద్రతా కేటగిరి వర్తిస్తుంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎక్కడకు వెళ్లినా 50 మందికి పైగా కమెండోలు ఆయనతోనే ఉంటారు.
Centre upgrades the security of Assam Chief Minister Himanta Biswa Sarma from Z-category CRPF security cover in the North-Eastern region to Z+ category CRPF security cover on an all-India basis.
(File photo) pic.twitter.com/mt2Q872CZf
— ANI (@ANI) October 14, 2022