దేశంలో సెమికండక్టర్ల (చిప్) తయారీ ప్లాంట్లను పెట్టే కంపెనీలకు వచ్చే ఆరేళ్లలో రూ. 76 వేల కోట్లను రాయితీలుగా ఇవ్వనుంది. అందులో భాగంగా ‘చిప్స్ టూ స్టార్టప్స్’ ప్రోగ్రామ్ను ప్రభుత్వం ప్రకటించింది. 76 వేల కోట్ల విలువైన రాయితీలను ఇచ్చేందుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.
ఇందుకు 85 వేల మంది ఇంజినీర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ స్కీమ్ లో ముఖ్యంగా ’20 సెమీ కండక్టర్ల డిజైన్, కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్కీమ్కు ‘డెవలప్మెంట్ ఆఫ్ సెమికండక్టర్స్ అండ్ డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. 2025 నాటికి దేశ డిజిటల్ ఎకానమీ రూ. 76 లక్షల కోట్లకు, జీడీపీ రూ. 380 లక్షల కోట్లకు చేరడంలో ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. సెమికండక్టర్ల సెగ్మెంట్లో పీఎల్ఐ స్కీమ్ కింద 35 వేల హై క్వాలిటీ జాబ్స్ క్రియేట్ అవుతాయని, ఇన్డైరెక్ట్గా లక్ష జాబ్లు వస్తాయని అంచనావేస్తున్నారు.