గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పాత కేసుల పరిష్కారం తరువాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు లోక్ సభలో ఎంపీ రంజిత్ రెడ్డి వేసిన ప్రశ్నకు గిరిజన సంక్షేమ మంత్రి అర్జున్ ముండా సమాధానమిచ్చారు.