కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేయడంలో విఫలమైన కేజ్రీవాల్ …తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే పేదలకు ఇంటింటికీ రేషన్ సరఫరా చేయడం కుదరలేదని చెప్పుకొచ్చారు. అయితే కేజ్రీ ఆరోపణల్ని ఖండిస్తూ వివరణ ఇచ్చింది కేంద్రం.
పంజాబ్ లో లబ్దిదారులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని సీఎం భగవంత మాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కూడా ఇదే తరహాలో చేయాలనుకున్నామని…కానీ కేంద్రం వల్లే చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. రేషన్ ను ఇంటింటికీ పంపిణీ చేయడం వల్ల పేదల సమయం వృథాకాకుండా ఉంటుందని…రేషన్ మాఫియా జోక్యాన్ని అరికట్టగలుగుతామని చెప్తూ కేంద్రం తనను ముందుకు సాగనీయడం లేదన్నారు. “ఢిల్లీలో నాలుగేళ్లుగా రేషన్ను ఇంటింటికి డెలివరీ చేసే ఈ పథకాన్ని అమలు చేయడానికి మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కానీ బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం దానిని అడ్డుకుంది.”అని కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా పంజాబ్ లో ఆ పథకాన్ని అమలుచేయాలనుకుంటోంది ఆప్. ఇక ఢిల్లీ విషయంగా కేంద్రంపై వరుస ఆరోపణలు చేస్తున్నారు.
2021 జూన్లో, ఢిల్లీలోని లబ్ధిదారులకు రేషన్లను ఇంటింటికి పంపిణీ చేసేందుకు సిద్ధపడ్డామని కానీ కేంద్రం పథకాన్నిఅడ్డుకుందని ఆప్ ఆరోపించింది. అనుమతులు లేవనే నెపంతో ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని నిరాకరించిందని మండిపడింది.
అసలైతే కరోనా వల్ల ఢిల్లీ వాసులు సహా దేశంలోని 80 కోట్ల మందికి కేంద్రం అప్పటికే ఉచిత రేషన్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలూ కేంద్రనిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే కేజ్రీవాల్ మాత్రం మరోరకమైన ఆరోపణలు చేశారు. తన పథకాన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు. కేజ్రీ తాజా ఆరోపణలపై కేంద్రం ఘాటుగా స్పందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన సబ్సిడీ ఆహార ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వ పథకానికి ఉపయోగించడం కుదరదని.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), 2013లో రేషన్ను ఇంటింటికి పంపిణీ చేసే నిబంధన లేదని స్పష్టం చేసింది. అయితే, మరో పథకం కింద ఆహార ధాన్యాలు పంపిణీ చేసే హక్కు రాష్ట్రానికి ఉందని కేంద్రం సమర్థించింది. ఎన్ఎఫ్ఎస్ఏలోని అంశాలను కలపకుండా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక పథకంతో ముందుకు వస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సైతం కేజ్రీవాల్ కు స్పష్టతనిచ్చారు.అయినా సరే కేజ్రీవాల్ కేంద్రంపై ఆరోపణలు చేశారు.
ఢిల్లీ గురించి చెప్పాలంటే, ఢిల్లీలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (ONORC) పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం అనేక నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ, కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటివరకు అలా చేయడంలో విఫలమైంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద కేటాయించబడిన ఈ పథకం, ఢిల్లీ బడ్జెట్కు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఢిల్లీలోని ఒక మిలియన్ కంటే ఎక్కువ వలస కార్మికులకు ప్రయోజనం ఉంటుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)